మే 27, (నేటి తెలుగు పత్రిక): సిద్దరామయ్య ఎల్లుండి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలపై కర్ణాటక రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడ్డాయి. సిద్దరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో పాటు, 2029 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. ఓబీసీ వర్గాల్లో బలమైన నాయకుడిగా సిద్దరామయ్యను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
