మే 27, (నేటి తెలుగు పత్రిక): ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై వైసీపీ అధినేత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో ప్రత్యేక బుక్లెట్ను విడుదల చేశారు.జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, జూన్ 8 లేదా 9న నియోజకవర్గ కేంద్రాల్లో సదస్సులు, జూన్ 12న భారీ ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు పాలన ప్రజలను మోసం చేసే విధంగా ఉందని జగన్ ఆరోపించారు. ప్రజల నిరసనల సెగలు ప్రభుత్వానికి తగలాలని ఆయన వ్యాఖ్యానించారు.
