మే 27, (నేటి తెలుగు పత్రిక): ఏపీ మంత్రి నారా లోకేష్ మహిళల రాజకీయ సాధికారతపై కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్లో మహిళల రిజర్వేషన్ బిల్లు అమలులోకి వచ్చినా రాకపోయినా, తెలుగుదేశం పార్టీ తరఫున 33 శాతం స్థానాలను మహిళలకు కేటాయిస్తామని వెల్లడించారు.మహానాడు వేదికగా మాట్లాడిన ఆయన, భవిష్యత్ రాజకీయాల్లో మహిళల పాత్ర మరింత కీలకంగా మారనుందని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు.ఇదే అంశంపై మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ అనౌన్స్మెంట్ చేస్తానంటూ ముందుగా లోకేశ్ చేసిన ట్వీట్ కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
