మే 27, (నేటి తెలుగు పత్రిక): పొన్నం ప్రభాకర్, బాల్కా సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉందని, అయితే మాజీ ఎంపీగా పనిచేసిన వ్యక్తి రైలు పట్టాలు కోయాలని, సింగరేణి కార్యాలయాలను కాల్చేయాలని పిలుపునివ్వడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే రైల్వే పోలీసులు కేసు నమోదు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. అలాగే ఆయనపై భారత రాష్ట్ర సమితిi కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.రాజకీయ ఉన్మాదంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు సమాజానికి హానికరమని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
