Breaking News

ఇందిరమ్మ ఇళ్ల కోసం హైదరాబాద్‌లో ఖాళీ స్థలాల పరిశీలన

మే 27, (నేటి తెలుగు పత్రిక): పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నాంపల్లి, మలక్‌పేట్, బహదూర్‌పురా నియోజకవర్గాల పరిధిలోని కుల్సుంపురా, అఫ్జల్‌సాగర్, డేరా, గడ్డి అన్నారం ప్రాంతాల్లో పాత ప్రభుత్వ క్వార్టర్స్‌తో పాటు ఖాళీ స్థలాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ల్యాండ్ పూలింగ్, స్థలాల లభ్యత, భవిష్యత్ నిర్మాణ అవకాశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పేదలకు గృహాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని అధికారులు తెలిపారు.

బాల్క సుమన్ వ్యాఖ్యలపై పొన్నం ఫైర్.. కేసు నమోదు చేయాలని డిమాండ్

మొక్కజొన్న రైతులకు భారీ ఊరట.. ₹1,173 కోట్లు విడుదల: తుమ్మల నాగేశ్వర రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *