మే 27, (నేటి తెలుగు పత్రిక): పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.నాంపల్లి, మలక్పేట్, బహదూర్పురా నియోజకవర్గాల పరిధిలోని కుల్సుంపురా, అఫ్జల్సాగర్, డేరా, గడ్డి అన్నారం ప్రాంతాల్లో పాత ప్రభుత్వ క్వార్టర్స్తో పాటు ఖాళీ స్థలాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ల్యాండ్ పూలింగ్, స్థలాల లభ్యత, భవిష్యత్ నిర్మాణ అవకాశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పేదలకు గృహాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని అధికారులు తెలిపారు.
