మే 27, (నేటి తెలుగు పత్రిక): ఏపీలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడుపై మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు పేరుతో టీడీపీ ‘దగానాడు’ నిర్వహిస్తోందని ఆరోపించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం క్రెడిట్ తీసుకుంటోందని మండిపడ్డారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం స్వయంగా ప్రారంభించి పూర్తి చేసిన ప్రాజెక్టులు ఏమున్నాయో చెప్పాలని ప్రశ్నించారు.విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత Nara Lokesh హయాంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి దెబ్బతిందని విమర్శించారు. అలాగే ప్రశ్నిస్తానని చెప్పిన నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ Pawan Kalyanపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
