Breaking News

తెలంగాణలో వరి సాగు తగ్గింపుపై కేంద్రం ఫోకస్

మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ సహా అధికంగా వరి సాగు చేస్తున్న రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌తో పాటు తెలంగాణను కూడా ఈ జాబితాలో చేర్చింది.తెలంగాణలో ప్రతి ఏడాది సుమారు ఐదు లక్షల ఎకరాల మేర వరి సాగును తగ్గించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో మొత్తం 25 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం తగ్గించే ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.దేశవ్యాప్తంగా ఐదేళ్లలో దాదాపు 2.5 కోట్ల ఎకరాల వరి సాగును తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. వరి అధిక ఉత్పత్తి, నిల్వ సమస్యలు పెరగడం, ఇతర పంటల సాగు మరియు ఉత్పత్తి తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇతర పంటల సాగును ప్రోత్సహించడం, నీటి వినియోగాన్ని తగ్గించడం, వ్యవసాయంలో సమతుల్యత సాధించడం కేంద్ర లక్ష్యంగా ఉన్నట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.

సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: అమిత్ షా

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *