Breaking News

సిద్దరామయ్య రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్!

మే 28, (నేటి తెలుగు పత్రిక): సిద్దరామయ్య రాజీనామా వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతుండగా, గవర్నర్ Thawar Chand Gehlot బెంగళూరులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా గవర్నర్ ముంబైకి వెళ్లినట్లు సమాచారం. ఆయన తిరిగి బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటారన్నదానిపై స్పష్టత లేకపోవడంతో, సిద్దరామయ్య రాజీనామా ఆమోద ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.అయితే గవర్నర్ అందుబాటులో లేకపోయినా, సిద్దరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయానికి సమర్పించే అవకాశమున్నట్లు సమాచారం. దీంతో కర్ణాటక రాజకీయ పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం: అమిత్ షా

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *