Breaking News

రూ.2 బియ్యం పథకం స్ఫూర్తితోనే అన్నా క్యాంటీన్లు: పవన్ కళ్యాణ్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమ వేదికగా ఆయన ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.సినీ రంగంలో అగ్రనటుడిగా ప్రజాదరణ పొందిన ఎన్టీఆర్, రాజకీయాల్లోకి వచ్చాక ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేశారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.రూ.2 కిలో బియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చాలన్న ఎన్టీఆర్ సంకల్పం ఎంతో గొప్పదని కొనియాడారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోందని తెలిపారు.పేదలు, సామాన్య ప్రజల సంక్షేమమే ఎన్టీఆర్ రాజకీయాల ప్రధాన లక్ష్యమని, ఆయన ఆశయాలను కొనసాగించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

రాయలసీమ జీవనాడి హంద్రీనీవాను పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదే: నిమ్మల

ఎన్టీఆర్ ఆశయాల సాకారానికి కట్టుబడి ఉన్నాం: మోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *