Breaking News

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: నారా లోకేశ్

అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.ప్రజల మద్దతుతోనే పంచాయతీల్లో విజయం సాధిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. ఏకగ్రీవాల అంశంపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని విమర్శించారు.గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎన్నికల్లో అనేక అరాచకాలు జరిగాయని ఆరోపించారు. నామినేషన్ల దశ నుంచే ఒత్తిళ్లు, బెదిరింపులతో ఏకగ్రీవాలు సాధించారని అన్నారు.ఆ అరాచకాల ఫలితంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు కోల్పోయి ప్రస్తుతం 11 స్థానాలకు పరిమితమైందని లోకేశ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కీలకం: పెమ్మసాని చంద్రశేఖర్

శబ్ద కాలుష్యంపై ప్రజలకు రఘురామ కీలక సూచన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *