మే 28, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్రంగా స్పందించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రేరేపించేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మంత్రి హెచ్చరించారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ అనుమతితోనే వచ్చాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.
