అమరావతి, మే 28, (నేటి తెలుగు పత్రిక): ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రార్థనా మందిరాల వద్ద శబ్ద కాలుష్యం అధికంగా ఉన్న చోట్ల వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసే విధానం గురించి వివరాలు తెలియజేస్తూ సంబంధిత దరఖాస్తు నమూనాను కూడా జత చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత 10 రోజులలోగా సమస్య పరిష్కారం కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాంటి సందర్భాల్లో ప్రార్థనా మందిరంపై చేసిన ఫిర్యాదు ప్రతితో పాటు, సంబంధిత పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ పేరు, మొబైల్ నంబర్ వివరాలను ప్రత్యేకంగా పంపాలని కోరారు.
ఈ వివరాలను
teluguveeralevaraarrr@gmail.com
కు మెయిల్ చేయాలని రఘురామకృష్ణరాజు ప్రజలకు సూచించారు.
