మే 28, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 20 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పిన పొంగులేటి.. ఆ మాట నిలబెట్టుకునే దమ్ముందా? అని ప్రశ్నించారు. “శపథాలు చేయడం కాదు.. చేతనైతే చేసి చూపించాలి. మేము రూ.70 వేలతో అగ్గిపెట్టెలాంటి ఇళ్లు కట్టలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఒక్కో గృహం.. 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.వీకెండ్ వచ్చిందంటే ప్రజల ఇళ్లు కూల్చి వికృతానందం పొందుతున్నారని ఆరోపిస్తూ.. అలాంటి వారు ఇళ్ల గురించి మాట్లాడటానికి సిగ్గుపడాలని కేటీఆర్ మండిపడ్డారు.
