మే 28, (నేటి తెలుగు పత్రిక): కాజీపేట రైల్వే తయారీ యూనిట్పై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. యూనిట్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అక్కడ ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని వెల్లడించారు.రానున్న ఐదేళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్లను కాజీపేటలో తయారు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు, సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో రైల్వే రంగ అభివృద్ధికి ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
