Breaking News

దేశంలో అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం

మే 29, (నేటి తెలుగు పత్రిక): 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ప్రాంతీయ రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వెల్లడించింది. ఆ పార్టీ ఆదాయం రూ.228.31 కోట్లుగా నమోదైంది.ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ రూ.219 కోట్లతో రెండో స్థానంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ.140 కోట్లతో మూడో స్థానంలో నిలిచాయి.ఖర్చుల విషయంలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూ.340.20 కోట్ల వ్యయంతో తొలి స్థానంలో నిలిచింది. అనంతరం బిజూ జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.దేశవ్యాప్తంగా మొత్తం 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేవలం 36 పార్టీలు మాత్రమే తమ లెక్కల నివేదికలను సమర్పించాయని తెలిపింది. ఆ వివరాల ఆధారంగానే ఈ నివేదిక రూపొందించినట్లు వెల్లడించింది.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *