మే 29, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ అభివృద్ధికి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు నాయకత్వం కీలకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అమీర్పేట్లో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.రెండువేల ముప్పై నాలుగు వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులు తమ ప్రభుత్వంపై ఉండాలని కోరారు.గతంలో హైటెక్ సిటీ, సైబర్ టవర్ నిర్మాణానికి ప్రజలు సహకరించినట్లే, ఇప్పుడు భవిష్యత్ నగర నిర్మాణానికి కూడా మద్దతు ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
