Breaking News

సంస్కరణల్లో ముందుండేది మేమే: లోకేశ్

మే 29, (నేటి తెలుగు పత్రిక): పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా సంస్కరణలు తీసుకురావడంలో తమదే ముందడుగు అని మంత్రి లోకేశ్ అన్నారు. మహానాడు సందర్భంగా మీడియా ప్రతినిధులు, యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు.మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దీనిపై పార్టీలో చర్చించి వచ్చే ఎన్నికల నాటికి అమలులోకి తీసుకువస్తామని తెలిపారు. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ పార్టీల్లో మార్పులు రావాల్సిందేనని లోకేశ్ పేర్కొన్నారు. యువత ఆలోచనలు, ఆశయాలకు తగ్గట్టుగా పార్టీ పనిచేయాలని, లేదంటే కొత్త తరానికి చేరువ కాలేమని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలోనే ముందుకు వెళ్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల్లో జరిగిన ఘటనలను ప్రజలు చూశారని విమర్శించారు. ఉపాధ్యాయ నియామకాలపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందన్నారు.యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిన లోకేశ్, రాష్ట్రానికి కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలపై యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగాల కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పరీక్షల్లో విఫలమైనా నిరాశ చెందొద్దని విద్యార్థులకు హితవు పలికారు.

శోలింగర్‌లో నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

ఢిల్లీలో రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ.. రాజ్యసభ సీటుపై చర్చల జోరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *