Breaking News

వైసీపీపై మంత్రి సుభాష్ ఘాటు విమర్శలు

మే 29, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్‌తో కలిసి పాల్గొన్న ఆయన, గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు.రాష్ట్రంలో నకిలీ మద్యం, గంజాయి, అక్రమ గనుల వ్యవహారాలు పెరగడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. మహిళా సాధికారత కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళలకు రాజకీయాల్లో అధిక ప్రాధాన్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.గత ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి భారీ మద్దతు ఇచ్చారని, అదే సమయంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ప్రజలు తమ ప్రభుత్వానికే మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు.చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *