మే 29, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యూఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కర్ణాటక రాజకీయాలు, పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు సమాచారం.ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ జాతీయ స్థాయిలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
