మే 29, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గుంటూరులో వైసీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు తదితర నేతలు పాల్గొన్నారు.డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అన్యాయం చేసిందని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు.డీఎస్సీ పేరుతో యువతను మోసం చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
