Breaking News

కర్ణాటకలో కొత్త సమీకరణాలు.. ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవుల అవకాశం

మే 29, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంలో ఈసారి ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని లింగాయత్ వర్గం నుంచి ఒకరికి, ఎస్సీ వర్గం నుంచి మరొకరికి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే అవకాశముందని సమాచారం. ఈ పదవుల కోసం పరమేశ్వర, ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్, జర్కిహోళి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.ఇక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపే అవకాశాలపై కూడా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే ఈ అంశాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

శోలింగర్‌లో నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

సిద్దరామయ్య ప్రస్థానం స్ఫూర్తిదాయకం: డీకే శివకుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *