Breaking News

మహానాడులో భజనలు తప్ప ఇంకేమీ లేవు: పేర్ని నాని

మే 29, (నేటి తెలుగు పత్రిక): మహానాడులో ప్రజా సమస్యలపై చర్చలు జరగకుండా కేవలం భజనలు మాత్రమే జరిగాయని వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబును పక్కన పెట్టి వేదికపై ఎక్కువగా లోకేశ్, దేవాన్ష్ గురించే మాట్లాడారని అన్నారు.వేదికపై చంద్రబాబు ముఖంలో ఆనందం కనిపించలేదని వ్యాఖ్యానించిన ఆయన, ఢిల్లీలో ప్రభావం చూపుతామంటున్న నేతలు ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. అదే అంశంపై పదేపదే తీర్మానాలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని విమర్శించారు.డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.

శోలింగర్‌లో నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

ఢిల్లీలో రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ.. రాజ్యసభ సీటుపై చర్చల జోరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *