మే 29, (నేటి తెలుగు పత్రిక): టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పకడ్బందీగా పూర్తి చేశామని తెలిపారు.ప్రతి ఓటును క్షుణ్ణంగా పరిశీలించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఇది అత్యంత కీలకమైన శిక్షణ కార్యక్రమమని, క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు.ఇతర రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపుల కారణంగా రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
