మే 29, (నేటి తెలుగు పత్రిక): మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు భారీగా అక్రమాలకు పాల్పడ్డారని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ పట్టాభిరామ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో అన్ని అనుమానాలు తాడేపల్లి వైపే చూపిస్తున్నాయని విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత సహాయకుడు నాగేశ్వర్ రెడ్డి భార్య ఖాతాలో కోట్ల రూపాయలు జమ కావడంపై పట్టాభిరామ్ ప్రశ్నలు లేవనెత్తారు. సాధారణ స్థాయిలో ఉన్న వ్యక్తి ఖాతాల్లో అంత పెద్ద మొత్తాలు ఎలా వచ్చాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు.బెంగళూరు సహా పలు ప్రాంతాల్లో ఆస్తులు ఎలా కూడబెట్టారో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే నాగేశ్వర్ రెడ్డిని పలుమార్లు విచారించినట్లు సమాచారం. ఆస్తుల వివరాలు, కాల్ డేటా ఆధారంగా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
