Breaking News

అనుమతి లేకుండా నాగచైతన్య పేరు, ఫొటోలు వాడకంపై హైకోర్టు ఆదేశాలు

మే 29, (నేటి తెలుగు పత్రిక): తన పేరు, ఫొటోలు, కంఠస్వరాన్ని అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని సినీ నటుడు నాగచైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం నాగచైతన్యకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.నాగచైతన్య పేరు, ముఖచిత్రం, కంఠస్వరాన్ని ఆయన అనుమతి లేకుండా వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత హక్కులు, గోప్యతను పరిరక్షించే దిశగా ఈ ఆదేశాలు ఇచ్చింది.ఇటీవల నాగార్జున కూడా తన ఫొటోలు, పేరును అనుమతి లేకుండా వాడుతున్నారంటూ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాలపై సినీ ప్రముఖులు తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

టికెట్ ధరలు పెంపుపై సీపీఐ నారాయణ ఫైర్

‘పెద్ది’కు ప్రత్యేక అనుమతులు.. టికెట్ ధరలు పెంపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *