మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్, కమిషనర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్లో బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను కలిసి సమాచార హక్కు చట్టం అమలు, కమిషన్ కార్యకలాపాలపై వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు పీవీ శ్రీనివాస్, అయోధ్య రెడ్డి, దేశాల భూపాల్ పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు పారదర్శక పరిపాలన అందించే దిశగా చేపడుతున్న చర్యలను వారు ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం.

