Breaking News

మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్ జగన్ సంతాపం

మే 29, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మరణంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.గాదె వెంకటరెడ్డి దీర్ఘకాలంగా ప్రజా సేవలో కొనసాగారని జగన్ పేర్కొన్నారు. ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటు అని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు.ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయన సన్నిహితంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని జగన్ స్మరించారు.

శోలింగర్‌లో నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్

ఢిల్లీలో రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ.. రాజ్యసభ సీటుపై చర్చల జోరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *