Breaking News

తెలంగాణ రాజకీయాలపై జనసేన దృష్టి.. నేతలతో పవన్ కీలక సమావేశం

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పార్టీ విస్తరణ, సంస్థాగత బలోపేతంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడం, ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అలాగే హైదరాబాద్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పార్టీ కార్యాచరణను రూపొందించనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యువత, మహిళలు, ఉద్యోగ వర్గాలను పార్టీ వైపు ఆకర్షించే కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.తెలంగాణలో జనసేనకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు పార్టీ ప్రభావాన్ని విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ చేపడుతున్న చర్యల్లో ఈ సమావేశం కీలక మైలురాయిగా మారనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నంబర్-1.. రైతుల కృషికే ఘనత: మంత్రి తుమ్మల

పట్టణ పేదలకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *