Breaking News

తెలంగాణలో వాతావరణ ద్వంద్వ పరిస్థితులు.. ఎండలు, వర్షాలు ఒకేసారి!

మే 30, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో నేడు వాతావరణం భిన్నంగా ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవైపు పలు జిల్లాల్లో వడగాలులు ప్రజలను ఇబ్బంది పెట్టనున్నప్పటికీ, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అదే సమయంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతేనే ఎండలో ప్రయాణించాలని సూచించారు.ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో 10 జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు.వైద్య నిపుణులు తగినంత నీరు తాగడం, నేరుగా ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరమని సూచిస్తున్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉపశమనం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *