Breaking News

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: తుమ్మల నాగేశ్వరరావు

మే 30, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్‌లో సహచర మంత్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, అవసరమైతే సిమెంట్, ఇసుక రవాణాకు ఉపయోగించే లారీలను కూడా ధాన్యం తరలింపునకు వినియోగిస్తున్నామని తెలిపారు.గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం ధాన్యం కొనుగోళ్ల కంటే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికంగా ధాన్యం సేకరిస్తోందని తుమ్మల వ్యాఖ్యానించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపుల విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. రైతులు ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు, జాప్యాలు జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు.రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న మంత్రి, రాష్ట్రంలో చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మరోసారి స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ నంబర్-1.. రైతుల కృషికే ఘనత: మంత్రి తుమ్మల

పట్టణ పేదలకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *