Breaking News

చెల్లి నగ్న ఫొటోలు అన్నకు పంపి బ్లాక్‌ మెయిల్

మే 30, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో ఓ యువతిని వేధిస్తూ, ఆమె కుటుంబ సభ్యులను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఓ యువకుడు యువతి ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా మార్చి, ఆమె అన్నకు పంపిస్తూ డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.పోలీసుల వివరాల ప్రకారం, బాధిత యువతి మరియు నిందితుడు ఒకే కళాశాలలో చదువుతున్నారు. వీరి మధ్య గతంలో స్నేహం ఉండగా, అనంతరం వ్యక్తిగత కారణాలతో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో యువతిపై కక్ష పెంచుకున్న నిందితుడు ఆమె ఫొటోలను సేకరించి మార్ఫింగ్ చేశాడు. అనంతరం ఆ ఫొటోలను యువతి అన్నకు పంపించి, రూ.50 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.డబ్బులు ఇవ్వకపోతే మార్ఫింగ్ చేసిన చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు ఆధారంగా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, కేసును తదుపరి విచారణ కోసం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.సోషల్ మీడియా, డిజిటల్ వేదికలను దుర్వినియోగం చేసి మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్ చేయడం, బ్లాక్‌మెయిల్ చేయడం, ఆన్‌లైన్ వేధింపులకు పాల్పడటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *