హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): సింగరేణిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.సింగరేణి అధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు బాల్క సుమన్ను అదుపులోకి తీసుకుని పలువురు గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, అధికార కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తుండగా, చట్టాన్ని అతిక్రమించే వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.
