Breaking News

నేడే ఐపీఎల్ ఫైనల్.. టైటిల్ ఎవరి సొంతం?

మే 31, (నేటి తెలుగు పత్రిక): అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నేడు ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. రెండోసారి ట్రోఫీని ముద్దాడాలనే లక్ష్యంతో ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.2022లో టైటిల్ గెలిచిన గుజరాత్ మరోసారి కప్‌పై కన్నేయగా, గతంలో ఒక్కసారి విజేతగా నిలిచిన ఆర్సీబీ తమ రెండో టైటిల్ కోసం పోరాడుతోంది. స్టార్ బ్యాటర్లతో భారీ స్కోర్లు నమోదు చేయాలని ఆర్సీబీ భావిస్తుండగా, బలమైన పేస్ దాడితో ప్రత్యర్థిని కట్టడి చేయాలని గుజరాత్ ప్రణాళికలు సిద్ధం చేసింది.కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో తొలి ట్రోఫీ సాధించాలని గుజరాత్ అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ సారథి రజత్ పాటిదార్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ను బహుమతిగా అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తుది సమరంలో ఎవరు విజేతగా నిలుస్తారో మరికొద్ది గంటల్లో తేలనుంది.

కప్‌పై సందేహం నుంచి చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఐపీఎల్ విజేతపై కాసుల వర్షం.. భారీ నగదు బహుమతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *