జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 24 మండలి స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగు స్థానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు స్థానాలకు, జార్ఖండ్లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ ఎన్నికల కోసం జూన్ 18న పోలింగ్ నిర్వహించనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం జూన్ 20 నాటికి పూర్తికానుంది.వివిధ రాష్ట్రాల్లో పదవీకాలం ముగుస్తున్న సభ్యుల స్థానాలను భర్తీ చేయడానికి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీల దృష్టి ఇప్పుడు ఈ ఎన్నికలపైనే కేంద్రీకృతమైంది.
