Breaking News

గ్రామ పంచాయతీల ఆదాయ పెంపుపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నుల వసూళ్లు, స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతంపై ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలు, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి పన్నుల వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారులతో చర్చించారు.

గ్రామ పంచాయతీల్లో పన్నులను సకాలంలో వసూలు చేసి ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి అవసరమైన నిధులు అందుబాటులో ఉండేలా ఆదాయ వనరులను బలోపేతం చేయాలని ఆదేశించారు.

విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి

అలాగే మౌలిక వసతుల కల్పన, పారదర్శక పరిపాలన, ప్రజా సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే రాష్ట్ర పురోగతికి పునాది అని, పంచాయతీలు ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *