Breaking News

పోరాటాల ఫలితంగా రైల్వే మండలి ఏర్పాటు: కేంద్ర మంత్రి రామ్మోహన్

జూన్ 01, (నేటి తెలుగు పత్రిక): ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్ష అయిన దక్షిణ కోస్తా రైల్వే మండలి సాకారమైందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ మండలి ఏర్పాటు కోసం జరిగిన దీర్ఘకాల పోరాటాలు, ప్రజల డిమాండ్లే ఫలించాయని ఆయన అన్నారు.

రైల్వే వ్యవస్థ బలోపేతమైతే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని, అందుకే ఈ అంశంపై ప్రత్యేకంగా కృషి చేసినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో కూడా రైల్వే మండలి ఏర్పాటు అవసరాన్ని నిరంతరం ప్రస్తావించానని చెప్పారు.

విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి

ప్రాంతీయ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, కొత్త ఉపాధి అవకాశాల కల్పనలో ఈ రైల్వే మండలి కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే పెండింగ్‌లో ఉన్న వంతెన సమస్యకు కూడా ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జాతీయ బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *