జూన్ 02, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రజలు రాచరిక భావజాలాన్ని, నియంతృత్వ ధోరణులను తిరస్కరించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వం పాలకులది కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యతతో పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కేవలం అభివృద్ధి, సంక్షేమం కోసమే కాకుండా ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం సాధన కోసం జరిగిందని తెలిపారు.
తెలంగాణ చరిత్రలో ప్రజలు అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు పోరాడారని గుర్తు చేశారు. నాటి రాచరిక వ్యవస్థ నుంచి నిన్నటి నియంతృత్వ ధోరణుల వరకు తెలంగాణ సమాజం తన పోరాట స్ఫూర్తిని చాటిందని అన్నారు.ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
