ఏపీఎస్ఆర్టీసీకి కొత్త బోర్డు – ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)కి కొత్త బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో బోర్డు ఏర్పాటు చేస్తూ, సంబంధిత నియామకాలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
బోర్డు సభ్యుల నియామకం
- చైర్మన్: కొనకళ్ల నారాయణ
- నామినేటెడ్ సభ్యులు: మొత్తం 6 మంది
- అధికార ప్రతినిధులు: 11 మంది
ఈ బోర్డులో APSRTC ఎండీ, ఆర్థిక, రవాణా, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులు, ఇతర సంబంధిత విభాగాల అధికారులు సభ్యులుగా నియమితులయ్యారు.
