Breaking News

Suicides are not the solution to the problem.

ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు….

నేటి యువతరం క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆత్మహత్యలు సమస్యలు పరిష్కారం కాదని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. మంగళవారం సాయంత్రం మచిలీపట్నం చాలెంజ్ కోచింగ్ సెంటర్ లో విద్యార్థి విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులు చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని భారత రాజ్యాంగ పరిధిలోబడి మన ప్రవర్తన ఉండాలని అన్నారు.. మహిళలు పరిరక్షణ కోసం అనేక చట్టాలు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యంగా బాలికల పట్ల లైంగిక వేధింపుల నివారణ కోసం పార్లమెంట్లో చట్టాలు చేశారని తెలియజేశారు.. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా వారి వాహనాలకు లైసెన్సులు ఇన్సూరెన్స్ హెల్మెట్లు ధరించాలని అన్నారు నిరుపేద కుటుంబాలకు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉచితంగా న్యాయం అందించడానికి జిల్లా న్యాయశాఖ ఏర్పాటు చేసిందని ఆ ఏర్పాట్లు వినియోగించుకోవాలని బాలాజీ తెలియజేశారు ప్రతి రెండు నెలలకు జాతీయ లోక్ అదాలతో జరుగుతుందని లోక్ అదాలతో కేసులు పరిష్కారం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం అని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దినపత్రిక చదవటం అలవాటు చేసుకోవాలని అన్నారు. స్నేహితులను ఎంపీక చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని మంచి స్నేహితుడి సహజమును జీవితంలో ఉన్నత శిఖరాలకు తీసుకు వెళుతుందని తెలియజేశారు.. నేటి విద్యార్థులు దిశా నిర్దేశం చేసుకొని వారు చదువు కొనసాగించాలని అన్నారు. ఛాలెంజ్ కోచింగ్ సెంటర్

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

ప్రిన్సిపాల్ విశ్వంశెట్టి విజయ భాస్కర్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన భారత దేశంలో పుట్టడం భారతీయులుగా అదృష్టమని ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలో ఎందరో మేధావులు అన్ని రంగాలలో ఉన్నారని ఆయన అన్నారు నేటి యువత నైతిక విలువలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని భాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు పలనియప్ప రెడ్డి కోటి నాగులు విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *