Breaking News

An exercise on the budget for the coming financial year

రాబోయే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై కసరత్తు

రాబోయే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు ప్రారంభం

హైదరాబాద్: రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, వివిధ శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ స్వీకరిస్తోంది.

ఈ నేపథ్యంలో, రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ప్రీ-బడ్జెట్ సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షత వహించిన ఈ సమీక్షలో పలు కీలక అంశాలపై చర్చించారు.

సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం” అని స్పష్టం చేశారు. విద్యార్థుల హాస్టల్ భద్రత, మంచి వసతుల కల్పనపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అద్దెలు, డైట్ చార్జీలు పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే చెల్లింపులు చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం

అటవీ భూముల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు. ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులు హాస్టళ్లను క్రమం తప్పకుండా సందర్శించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బడ్జెట్ రూపొందింపులో సమగ్ర ప్రణాళిక

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు తగిన నిధులు కేటాయించేందుకు సంబంధిత శాఖల నుంచి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. సామాజిక సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు వంటి రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రాబోయే బడ్జెట్‌ ప్రజలకు మేలు చేసేలా రూపొందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని భట్టి విక్రమార్క సూచించారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *