Breaking News

అసెంబ్లీలో హీట్.. కౌశిక్‌రెడ్డి వివాదం.. BRS ఎమ్మెల్యేల సస్పెన్షన్

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు సభను కుదిపేశాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిను ఉద్దేశించి ‘గన్‌తో కాల్చి పడేస్తా’నని బెదిరించారన్న ఆరోపణలు పెద్ద దుమారానికి దారి తీశాయి.ఈ ఘటనపై అధికార పక్షం తీవ్రంగా స్పందించి కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వీడియో ఆధారాలను పరిశీలించాలని సూచిస్తూ ఈ అంశాన్ని స్పీకర్ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి స్పందిస్తూ, సభలో ఇలాంటి ప్రవర్తనను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను సమర్థిస్తే అసెంబ్లీ వాతావరణం దెబ్బతింటుందని హెచ్చరించారు.ఇదే అంశంపై సభలో నిరసనలకు దిగిన భారత రాష్ట్ర సమితి సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ ఈరోజు, రేపు కొనసాగుతుందని ప్రకటించారు.మొత్తంగా, కౌశిక్ రెడ్డి వివాదం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారి, అసెంబ్లీ కార్యకలాపాలను కుదిపేసింది.

“అసెంబ్లీని ఇష్టానుసారంగా నడుపుతున్నారు”.. తలసాని ఘాటు విమర్శలు

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం కవిత పోరాటం.. 2 రోజుల్లో పరిష్కారం డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *