Breaking News

కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై రేవంత్ ఫైర్.. కడియంకు మద్దతు

మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ అసెంబ్లీ ఘటనపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీతి, నిబద్ధతపై ఎవరూ ప్రశ్నించలేరని, ఆయన మచ్చలేని నాయకుడని సీఎం కొనియాడారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సమానంగా ప్రజా జీవితంలో ఎదిగిన నేతగా కడియంను పేర్కొన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ప్రశ్నిస్తూ, కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు దీనిని సమర్థిస్తారా అని సీఎం నిలదీశారు. అసభ్యకరంగా ప్రవర్తించడం పార్టీ విధానమా అని ప్రశ్నించారు.కేసీఆర్‌ను అవమానిస్తే బీఆర్‌ఎస్ నేతలు ఊరుకుంటారా అని ప్రశ్నిస్తూ, కడియంకు జరిగిన అవమానం అదే స్థాయిలో కేసీఆర్‌కు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు.కౌశిక్ రెడ్డి ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని స్పష్టం చేస్తూ, ఆయనపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

“అసెంబ్లీని ఇష్టానుసారంగా నడుపుతున్నారు”.. తలసాని ఘాటు విమర్శలు

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం కవిత పోరాటం.. 2 రోజుల్లో పరిష్కారం డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *