మార్చి 31, నేటి తెలుగు పత్రిక: చల్లపల్లి పోలీస్స్టేషన్లో పేలుడు ఘటన కలకలం రేపింది. సీజ్ చేసిన టపాసులను కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక ఎస్ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ప్రభావంతో పోలీసు జీపు స్వల్పంగా ధ్వంసమైంది. గాయపడిన సిబ్బందిని వెంటనే చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పేలుడుకు గల కారణాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.

