Breaking News

ఎన్టీఆర్‌కు సీఎం నినాదాలు.. ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో ఫ్యాన్స్ హంగామా

మే 20, (నేటి తెలుగు పత్రిక): యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’ గ్లింప్స్ విడుదల కావడంతో అభిమానుల సందడి థియేటర్ల వద్ద తారాస్థాయికి చేరింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, హైదరాబాద్‌లోని పలు థియేటర్ల వద్ద అభిమానులు భారీ సంబరాలు నిర్వహించారు.బాలానగర్ విమల్ థియేటర్ వద్ద అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేశారు. బాణసంచా కాల్పులు, డీజే సౌండ్లతో థియేటర్ పరిసరాలు సందడిగా మారాయి. గ్లింప్స్‌లో ఎన్టీఆర్ మాస్ ఎంట్రీ, ప్రశాంత్ నీల్ స్టైల్ యాక్షన్ విజువల్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా అభిమానులు “సీఎం.. సీఎం..” అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు నినాదాలు చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గతంలో రాజకీయ ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టినా, అభిమానుల్లో మాత్రం ఆయన రాజకీయ ఎంట్రీపై ఆసక్తి కొనసాగుతోంది. తమిళనాడులో విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై కూడా సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.ఇక ‘డ్రాగన్’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టంగుటూరి ప్రకాశం పంతులకు సీఎం చంద్రబాబు, లోకేశ్ నివాళులు

మంత్రి ఫిర్యాదుతో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *