Breaking News

శివక్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” షూటింగ్ సందడి

మే 22, (నేటి తెలుగు పత్రిక): తాళాయపాలెంలోని ప్రముఖ శివశైవ క్షేత్రంలో “తేజు ఫిలిమ్స్” చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. దర్శకుడు సుధాకరరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ షూటింగ్ మూడో షెడ్యూల్‌గా నిర్వహించబడింది. చిత్రంలో సీనియర్ నటుడు కొండపల్లి అప్పారావు అఘోర పాత్రలో ప్రత్యేకంగా నటించి ఆకట్టుకున్నారని ఆయన పేర్కొన్నారు. శివశైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీశివ స్వామి ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభించినట్లు తెలిపారు.ఆలయ పరిసరాల్లో చిత్రీకరణకు దేవాలయ అధికారుల నుంచి పూర్తి సహకారం అందిందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి సంతోష్ రావు బల్గూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సుధాకరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.కథను జగపతి శ్రీనివాస్ అందించగా, సినిమాటోగ్రఫీతో పాటు ఎడిటింగ్ బాధ్యతలను దాసరి రవికుమార్ నిర్వహిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా, ఎస్.ఏ.టి. శ్రీధర్ పీఆర్వోగా పని చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌లో నాల్గో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసి, అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు వెల్లడించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *