Breaking News

రాయలసీమను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్

మే 22, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. కడప జిల్లాలోని టీ.కోడూరులో ఏర్పాటు చేసిన భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.సుమారు రూ.3 వేల కోట్ల పెట్టుబడితో SAEL Industries Limited ఆధ్వర్యంలో నిర్మించిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. ఈ ప్రాజెక్టు దార్శనికత, నమ్మకం, వేగానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.కేవలం 11 నెలల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం వెనుక రైతుల సహకారం, త్యాగం కీలకమని ఆయన పేర్కొన్నారు. రాయలసీమను పారిశ్రామికంగా, ఆర్థికంగా బలోపేతం చేసి అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు.పర్యావరణ హితమైన క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తులో దేశానికి విద్యుత్‌ను ఎగుమతి చేసే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు.

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ గోల్డ్ మైన్స్ గుర్తింపు: మంత్రి కొల్లు రవీంద్ర

పెన్షన్ల అంశంలో జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *