Breaking News

తుంగభద్రలో హైదరాబాదీలు మృతి

మే 31, (నేటి తెలుగు పత్రిక): కర్నూలు జిల్లా తుంగభద్ర నదిలో గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలను సహాయక బృందాలు గుర్తించి వెలికితీశాయి. మృతుల్లో సతీశ్ (35), ఆయన కుమారుడు యువన్ చంద్ర (5), అలాగే మంత్రాలయంకు చెందిన ధను (23) ఉన్నారు.ఇంకా గల్లంతైన రాఘవేంద్ర (25), సంధ్య (22) కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఎంఆర్ఓ రమాదేవి, సీఐ దస్తగిరి పర్యవేక్షణలో మత్స్యకారులు, సహాయక బృందాలు నదిలో విస్తృతంగా అన్వేషణ చేపట్టాయి.హైదరాబాద్‌కు చెందిన కుటుంబ సభ్యులు ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వచ్చి, అనంతరం తుంగభద్ర నదిని చూసేందుకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అధికారులు ప్రజలు నదులు, జలాశయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కూటమి సర్కారుపై జగన్ తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *