హైదరాబాద్, మే 31, (నేటి తెలుగు పత్రిక): అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముషీరాబాద్లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, మరో ఏడాది పాటు పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేస్తే రాజకీయంగా లెక్కలు సరిచేసే అవకాశం వస్తుందని అన్నారు.కాంగ్రెస్ను చూసుకుని బీజేపీ, బీజేపీని చూసుకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించిన కేటీఆర్, ప్రజలు సరైన సమయంలో ఇరు పార్టీలకు సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా హైదరాబాద్ నగరానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన, యువతకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ, ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా చర్యలు తీసుకుంటోందని, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమైనవేనని పేర్కొంటున్నారు.
