Breaking News

అమరావతిలో మధ్యతరగతి, పేదలకు గృహ సముదాయాలు.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

మే 31, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి నిర్వహించిన సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరల్లో నివాస వసతి కల్పించేందుకు ప్రత్యేక గృహ సముదాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే నిర్మాణ రంగానికి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం సీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగర మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపింది.ఇక హైకోర్టు భవనాల పరిసర ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.547 కోట్ల వ్యయంతో పనులు చేపట్టేందుకు సమావేశం అంగీకారం తెలిపింది.రాజధాని అమరావతిని ఆధునిక నగరంగా తీర్చిదిద్దడంతో పాటు అన్ని వర్గాల ప్రజలకు నివాస, మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సమావేశంలో స్పష్టం చేశారు.

రాష్ట్రానికి మరో 7 విమానాశ్రయాలు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి

ఏపీలో కొత్త వితంతు పెన్షన్లు.. రూ.2,728 కోట్ల నిధుల విడుదల: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *