Breaking News

చంద్రబాబు వైఫల్యాలకు జగన్‌నే ప్రత్యామ్నాయం: సజ్జల రామకృష్ణారెడ్డి

మే 31, (నేటి తెలుగు పత్రిక): అధికారంలోకి రావడానికి హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిరాశపరిచారని ఆయన ఆరోపించారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన సజ్జల, వైఎస్ జగన్ హయాంలో ప్రకటించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని, ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరిందని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన హామీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు.ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియపై కూడా ప్రశ్నలు ఉన్నాయని, వాటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు విధానాలకు ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్ నిలుస్తారని, ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

రాష్ట్రానికి మరో 7 విమానాశ్రయాలు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి

ఏపీలో కొత్త వితంతు పెన్షన్లు.. రూ.2,728 కోట్ల నిధుల విడుదల: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *